జిల్లా కేంద్రంలో లాక్డౌన్ను పర్యవేక్షించిన ఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 23 : కరోనా సమయంలో అత్యవసర వైద్యసేవలకు తప్పా ఎవరూ అనవసరంగా బయటికి రావొద్దని, లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్, రాంమందిర్, వన్టౌన్ పీఎస్ పరిసర ప్రాం తాల్లో లాక్డౌన్ పరిస్థితులను ఉదయం 10.10 గంటలకే ఎస్పీ పర్యవేక్షించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టం ద్వారా ప్రజలకు సూచనలు జారీ చేశారు. వాహనదారులను ఆపి వివరాలు తెలుసుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.