బాసర : బాసర సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగ కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం సరస్వతి అమ్మవారు చంద్రఘంట రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించారు. ఆలయంలో మంగళహారతి ,మంత్రపుష్పం, పుణ్యహావచనము, తదితర పూజలు నిర్వహించారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకొని భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి హాజరయ్యారు. ఆదివారం కుష్మాండ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.