ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 23 సెంటర్లు
పరీక్ష రాయనున్న 4696 మంది విద్యార్థులు
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
కొవిడ్ నిబంధనలు అమలు
నిర్మల్ అర్బన్, జూలై 16 : పాలిటెక్నిక్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశం కోసం శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో 2744 మంది విధ్యార్థులు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ అన్నపూర్ణ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు.
పకడ్బందీ ఏర్పాట్లు..
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖతో పాటు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా, కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు పర్చనున్నారు. గంట ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు హాల్టికె ట్, పెన్, హెచ్బీ పెన్సిల్, రబ్బరు, మాస్కు, శానిటైజర్, నీళ్ల బాటిల్ వెంట తెచ్చుకోవాలి.
పరీక్షా కేంద్రాలివే..
పాలిసెట్ కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోనే 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో 200 మంది, శాంతినగర్ కాలనీలోని బాలుర జూనియర్ కళాశాలలో 150, బాలికల జూనియర్ కళాశాలలో 225, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 200, సోఫీనగర్ బాలికల విద్యాలయంలో 192, రవి హైస్కూల్లో 180, సెయింట్ థామస్లో 250, వశిష్ఠ డిగ్రీ కళాశాలలో 200, దీక్ష డిగ్రీ కళాశాలలో 150, దీక్ష జూనియర్ కళాశాలలో 250, జేవీఎన్ఆర్ పాఠశాలలో 276, వశిష్ఠ జూనియర్ కళాశాలలో 200, శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాలలో 151, శ్రీ వశిష్ఠ డిగ్రీ కళాశాలలో 120 మంది చొప్పున పరీక్ష రాయనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం…
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశాం.. కొవిడ్ను దృష్టిలో ఉంచుకొని విధ్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాం. విద్యార్థులు హాల్టికెట్తో పాటు మాస్కు, శానిటైజర్, వాటర్ బాటిల్తో పరీక్షకు హాజరుకావాలి. సెంటర్లలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా 144 సెక్షన్ను అమలుపర్చనున్నాం.