హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ గురుకుల సెట్ వాయిదా పడింది. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2021– 22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే టీటీడబ్ల్యూఆర్జేసీ (తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ) సెట్ను వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 49 టీటీడబ్ల్యూఆర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 11న జరగాల్సి ఉన్నది. అయితే కరోనా నేపథ్యంలో అది వాయిదాపడింది. పూర్తివివరాలకు www.tgtwgurukulam.telangana.gov.in చూడవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..