న్యూఢిల్లీ : వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్ఈఈటీ) NEET 2021 కోసం దరఖాస్తు దాఖలు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పొడిగించింది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 10 వరకు అందజేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 6వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుండటంతో.. విద్యార్థుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించారు.
దరఖాస్తు దాఖలు గడువును పొడిగించడంతో పాటు దరఖాస్తు ఫీజు చెల్లించే తేదీని కూడా ఆగస్టు 10 రాత్రి 11.50 వరకు ఏజెన్సీ పొడిగించింది. దరఖాస్తులో మార్పులను చేసుకునేందుకు ఆగస్టు 11 నుంచి 14 వ తేదీ మధ్యాహ్నం 2 వరకు అవకాశం కల్పించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్ఎస్), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సిఫార్సుపై ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకున్నది. వైద్య ప్రవేశ పరీక్ష నీట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు బీఎస్సీ (ఆనర్స్) తో పాటు వివిధ మెడికల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
చరిత్రలో ఈరోజు.. కశ్మీర్ స్వాధీనానికి పాక్ కుట్ర
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..