అందాల కాశ్మీరాన్ని సొంతం చేసుకోవడం ద్వారా అందమైన ప్రాంతంతోపాటు ఆదాయాన్ని కూడా పొందవచ్చునని పాకిస్తాన్ (Capture of Kashmir) కుట్రపన్నింది. దానిలో భాగంగా 1965 లో సరిగ్గా ఇదే రోజున జిబ్రాల్టర్ ఆపరేషన్కు పాకిస్తాన్కు పూనుకున్నది. ఇదే 1965 భారత్-పాకిస్తాన్ యుద్ధానికి తెరలేపింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన దాదాపు 6 వేల మంది సైనికులు చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కశ్మీర్ను ఎలాగైనా ఆక్రమించుకోవాలన్న తపనతో పాకిస్తాన్.. భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నది.
చైనాతో జరిగిన యుద్ధంలో ఓటమి, నెహ్రూ మరణంతో కుంగిపోయి ఉన్న భారతదేశాన్ని మరింత దెబ్బకొట్టేందుకు పొరుగున ఉన్న పాకిస్తాన్ కుట్ర పన్నింది. అందాలకు నెలవైన కశ్మీర్ను హస్తగతం చేసుకోవడం ద్వారా పర్యాటకులను ఆకర్శిస్తూ ఆదాయం పెంచుకోవాలని పాకిస్తాన్ ఆలోచించింది. ఇదే అదనుగా 1965 లో జిబ్రాల్టర్ ఆపరేషన్ను ప్రారంభించింది. వేలాది మంది పాకిస్తానీ యోధులు గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందారు. అదను చూసి ఆగస్టు 5 ఆయుధాలతో కశ్మీర్లోకి ప్రవేశించారు. వారు కశ్మీర్లోని ముస్లింలను భారతదేశానికి వ్యతిరేకంగా ప్రేరేపించడం, భారత సైన్యంతో పోరాడి కశ్మీర్ను వశపరుచుకోవడం అనే రెండు బాధ్యతలు వారికి ఇచ్చారు. కశ్మీరీల మాదిరిగా దుస్తులు, జీవనశైలిని అనుకరిస్తూ జీవించడం మొదలెట్టగా.. స్థానికులు గుర్తించి భారత సైన్యానికి సమాచారం అందించారు. భారత సైన్యం ప్రారంభంలో చాలామందిని అరెస్ట్ చేసింది. అయితే, తమ ప్రణాళిక విఫలం అవుతుండటాన్ని గమనించిన పాకిస్తాన్.. ఫిరంగులతో కాల్పులు జరుపడం ప్రారంభించింది. ఇది భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధానికి దారితీసింది.
సెప్టెంబర్ 22 న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించడంతో యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో భారతదేశం 1920 కిలోమీటర్లు, పాకిస్తాన్ 540 కిలోమీటర్ల భూమిని ఆక్రమించాయని అంచనా వేశారు. అలాగే, 2,735 మంది భారత సైనికులు, 5,988 మంది పాకిస్తాన్ సైనికులు ఈ యుద్ధంలో చనిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
2019 : ఆర్టికల్ 370 ని తొలగించడం ద్వారా కశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చే నిబంధనను రద్దు చేసిన భారత ప్రభుత్వం
2006 : టైగ్రిస్ నదిపై వివాదాస్పద ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించిన టర్కీ ప్రభుత్వం
1991 : భారతదేశంలో హైకోర్టు చీఫ్ జస్టిస్గా తొలిసారి మహిళ లీలా సేథ్ నియామకం
1963 : నీటి అడుగున, బహిరంగ ప్రదేశాల్లో అణు పరీక్షలను నిషేధించే ఒప్పందంపై సంతకాలు చేసిన బ్రిటన్, అమెరికా, రష్యా
1962 : వర్ణ వివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో ఆందోళన చేపట్టిన నెల్సన్ మండేలా అరెస్ట్
1914 : ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్ ఒహియోలోని క్లీవ్ల్యాండ్లో ఏర్పాటు
ముక్కులో వెంట్రుకలు కట్ చేయొద్దా..? ఎందుకు..?
ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఉచితం
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..