న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో మరో పరీక్ష వాయిదాపడింది. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్సీహెచ్ఎం) జేఈఈ-2021ని ఎన్టీఏ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 12న జరగాల్సి ఉంది. కాగా, పరీక్ష వాయిదా పడటంతో దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పొడించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు మే 31 సాయంత్రం 5 గంటల వరకు అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థులు నిత్యం అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
వెబ్సైట్: nchmjee.nta.nic.in, nta.ac.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి