హైదరాబాద్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ) : బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సచివాలయం ఎదుటు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించనున్న సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థపాక అధ్యక్షుడు జక్కె వీరాస్వామిగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.