భారత సైన్యంలో చేరాలనుకునే వారికి సువర్ణావకాశం. నాన్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ పోస్టుల కోసం భారత టెరిటోరియల్ ఆర్మీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు నేటి ( జూలై 20 ) నుంచి ఆగస్టు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు లెఫ్టినెంట్ హోదా కల్పించనున్నారు. సాధారణ ఆర్మీ అధికారులకు ఉన్నట్టుగా వీరికి కూడా అవే అధికారాలు, శాలరీ, అలవెన్సులు అందిస్తారు. ఏడాదిలో రెండు నెలల తప్పనిసరి శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.56,100 నుంచి 1,77,500 వరకు శాలరీ ఇవ్వనున్నారు.
రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. రాత పరీక్ష రెండు భాగాలుగా ఆఫ్లైన్ విధానంలో జరుగుతుంది. మొదటి పేపర్లో రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ ఉంటాయి. ఇక రెండో పేపర్లో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ఉంటాయి. మొత్తం రెండు వందల మార్కులకు ఈ పేపర్ ఉంటుంది. ఒక్కో పేపర్కు రెండు గంటల సమయం ఇస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై అవ్వాలంటే కనీసం 40 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో 1110 అప్రెంటిస్లు
ఎస్ఐఆర్-సీడీఆర్ఐలో జూనియర్ అసిస్టెంట్లు
నాబార్డ్లో 162 మేనేజర్ పోస్టులు