హైదరాబాద్ : ఐపీఎల్ టికెట్ల(IPL tickets) అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గురువారం ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) ఎదుట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన(Protest) చేపట్టారు. బ్లాక్లో టికెట్లు అమ్ముతూ క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) నిరాశకు గురి చేస్తుందన్నారు. ఇప్పిటికైనా హెచ్సీఏ తన తీరు మార్చుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కాగా, ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం రాత్రి 7:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.