Loksabha Elections 2024 : ఏ రూపంలోనైనా మత ప్రాతిపదికన రిజర్వేషన్లను కాషాయ పార్టీ వ్యతిరేకిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లో కోత విధించి మతపరమైన రిజర్వేషన్ కేటాయించాలనే కాంగ్రెస్, ఎస్పీ, ఇండియా కూటమి అజెండాను దేశ ప్రజలు ఆమోదించబోరని అన్నారు. గోరక్నాథ్ ఆలయ ప్రాంగణంలో యోగి ఆదిత్యానాథ్ విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు బీజేపీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.
అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను అణిచివేస్తూ ఎమర్జన్సీ చీకటిరోజులను దేశంపై రుద్దిన విషయం మరువరాదని యోగి ఆదిత్యానాథ్ గుర్తుచేశారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ చేసిన పాపాలను ప్రజలు ఇంకా మరువలేదని చెప్పారు. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వంలో ఎస్పీ, బీఎస్సీలు భాగస్వామ్య పక్షాలుగా కాంగ్రెస్ పాపాల్లో పాలుపంచుకున్నాయని గుర్తుచేశారు.
ఓబీసీల కోటా 27 శాతంలో కోత విధించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో 6 శాతం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ఓ వర్గానికి కట్టబెట్టిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లో సచార్ కమిటీ సాకుతో కొన్ని ముస్లిం కులాలకు సదరు కోటాలో వాటా కల్పిస్తూ వారిని ఆ కేటగిరీలో చేర్చిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మతప్రాతిపదికన రిజర్వేషన్లతో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ కోత విధించిందని అన్నారు.
Read More :
MLA Jagadish Reddy | తెలంగాణలో మళ్లీ కేసీఆర్ హవా మొదలైంది.. త్వరలో మార్పు తధ్యం