టోక్యో : టోక్యో ఒలిపింక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ వినేశ్ ఫోగట్ శుభారంభం చేసింది. 53 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్కు చేరింది. తొలి రౌండ్లో స్వీడన్ రెజ్లర్ సోఫియా మాట్సన్ సోఫియాను 7-1 తేడాతో మట్టికరిపించింది. వినేశ్ ఫోగట్ మ్యాచులో ప్రత్యర్థిపై ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. తొలి పిరియడ్లో 2, 2, 1 స్కోరు సాధించిన ఆమె రెండో పిరియడ్లో స్కోరు 2 మాత్రమే సాధించింది. ప్రత్యర్థి మాట్సన్ కేవలం ఒకే పాయింట్ సరిపెట్టుకున్నది. తరువాతి మ్యాచ్లో వినేశ్ బెలారస్కు చెందిన వనేసా కలడ్జింసక్యాతో తలపడనుంది. మరో రెజ్లర్ అన్షు మాలిక్ మహిళల 57 కేజీల విభాగంలో రీపేజ్ రౌండ్లో ఓడిపోయింది. రష్యాకు చెందిన రెజ్లర్ వలెరియా చేతిలో 1-5 తేడాతో అన్షు ఓటమిపాలైంది. అన్షు మంచి డిఫెన్స్ చూపించినప్పటికీ పరాజయం తప్పలేదు. మరో వైపు కాంస్య పతకం కోసం పురుషుల హాకీ జట్టు జర్మనీతో తలపడుతున్నది. 5-3 గోల్స్ తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్నది.