కోల్కతా: కరోనా వైరస్ సోకి టీఎంసీ అభ్యర్థి మరణించడంతో ఆయన భార్య.. ఎన్నికల అధికారులపై ఫిర్యాదు చేసింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖద్దా అసెంబ్లీ సీటు నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అభ్యర్థి కాజల్ సిన్హా బరిలో నిలిచారు. ప్రచారంలో ఉండగానే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కు గురై కాజల్ సిన్హా చనిపోయారు. దాంతో ఆయన భార్య నందితా సిన్హా.. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ తోపాటు ఇతర ఎన్నికల కమిషన్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం స్వయంగా నందిత ఖార్దా పోలీస్ స్టేషన్కు వెళ్లిన నందితా సిన్హా.. ఈసీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, సాధారణ ప్రజల భద్రత కోసం ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నందితా సిన్హా ఆరోపించారు. వైరస్ వ్యాప్తి చెందుతున్నదని తెలిసి కూడా ఎన్నికలను వాయిదా వేయకుండా చేసి తన భర్తను బలిగొన్నారని, అందుకుగాను ఈసీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో కోరారు.
టీఎంసీ అభ్యర్థి అయిన కాజల్ సిన్హా ఏప్రిల్ 25 న కరోనా వైరస్కు గురై మరణించారు. కాజల్ సిన్హా బరిలో నిలిచిన ఖద్దా స్థానానికి ఈ నెల 22 నే పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు వివిధ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు చనిపోయారు. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా కరోనా బారిన పడి మరణించారు.
‘మహారాష్ట్ర లాక్డౌన్ మరో 15 రోజులు పొడగింపు’: మంత్రి రాజేష్ తోపే
కేరళలో అత్యధికంగా 32 వేల కేసులు నమోదు
వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లకు శుభవార్త.. ఇక మాస్కులు లేకుండా తిరగొచ్చు
బ్రెగ్జిట్ తర్వాత వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించిన ఈయూ ఎంపీలు
సుప్రీం జస్టిస్ బ్లాక్ మెయిల్కు పాక్ ప్రభుత్వం విఫల యత్నం: బిలావాల్ భుట్టో
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన ఎన్సీటీ బిల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
దమ్ముంటే నాపై పోటీ చేయాలి : సిద్దుకు కెప్టెన్ ఛాలెంజ్
ఇద్దరు నియంతలు.. ఒకరి జననం.. ఒకరి మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..