కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బంది పెడుతున్నది. మన దేశంలో సెకండ్ వేవ్ ఉధృతంగా మారడంతో రోగుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. రోగుల సంఖ్య భారీగా పెరుగడంతో దవాఖానల్లో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. ఆక్సిజన్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మటుకు ఈ వైరస్ సోకిన వారికి దవాఖానల్లో ఓపీ కింద వైద్యులు చికిత్స అందించే వీలున్నది. మనం ఇంట్లోనే ఉండి వైద్యుల సలహాలు పొందుతూ కరోనా పాజిటివ్ నుంచి బయటపడవచ్చు. కరోనా వైరస్ పాజిటివ్గా తేలినట్లయితే చేయాల్సినవి, చేయకూడనివి ఏంటో తెలుసుకుందాం.
తేలికపాటి లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చు.
అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ప్రత్యేక గదిలో వేరుగా ఉండండి.
తక్కువ జ్వరం ఉంటే పారాసెటమాల్ తీసుకోవాలి.
జ్వరం, ఆక్సిజన్ స్థాయిలను రోజుకు కనీసం 10-15 సార్లు తనిఖీ చేసుకోవాలి. దీని కోసం మొబైల్ ఫోన్లో రిమైండర్ను సెట్ చేసుకోవాలి.
ఆక్సిజన్ స్థాయి 94-100 మధ్య ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది 94 కన్నా తక్కువ పడిపోతేనే వైద్యుడిని సంప్రదించాలి.
వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే.. కనీసం 5-7 రోజులు జ్వరం వస్తుంది. ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది.
అందుకని జ్వరం, ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి.
ఇంటికి సమీపంలోని దవాఖానల్లోని పడకల లభ్యత గురించి సమాచారం సేకరించాలి.
ఏ హాస్పిటల్లో వెంటిలేటర్, ఐసీయూ లేదా ఆక్సిజన్ పడకలు ఉన్నాయో తెలుసుకోండి.
ద్రవ ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇది ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం సులభం చేస్తుంది.
రోజులో కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి.
రోజంతా మాస్క్ ధరించాలి.
చేతులను తరుచుగా శానిటైజర్తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
తేలికపాటి లక్షణాలు ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్ లేదా రెమ్డెసివిర్ తీసుకోవద్దు.
లక్షణాలు తీవ్రంగా ఉంటే ఎప్పటికప్పుడు వైద్యుడికి వెల్లడిస్తూ ఆయన సలహాలు తీసుకోవాలి.
ఆక్సిజన్ స్థాయి నిరంతరం తగ్గిపోతుంటే వెంటనే దవాఖానకు వెళ్లాలి.
ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్లో కొనకూడదు. అందుకు సమయాన్ని వృథా చేయకూడదు.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోకూడదు.
గూగుల్ సెర్చ్ చేసి మందులు తీసుకోవద్దు.
సొంత వైద్యం తీసుకోవద్దు.
లక్షణాలు తీవ్రంగా ఉంటే ఇంట్లో చికిత్స తీసుకోవద్దు.
వాడేసిన మాస్కులను వినియోగించవద్దు.
మాస్క్ లేకుండా ఇంట్లో తిరుగకూడదు.
బాలి సమీపంలో దొరికిన ఇండోనేషియా జలాంతర్గామి ఆచూకీ
ఉత్తమ 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ యంత్రాలివే..
శ్రీలంకలో డెడ్లీ కరోనా వైరస్ గుర్తింపు
కరోనా నిబంధనల ఉల్లంఘన : 13 మంది అభ్యర్థులపై ఎఫ్ఐఆర్
కరోనా ఎఫెక్ట్ : పూరీ జగన్నాథ్ ఆలయం మూసివేత
అమెరికన్ ఎక్స్ప్రెస్, డైనర్స్ క్లబ్పై ఆర్బీఐ నిషేధం
భారతదేశంలో పరిస్థితి ఘోరమైనది : డబ్ల్యూహెచ్ఓ
సుమిత్ర మహాజన్ చనిపోయారంటూ పుకార్లు.. కేసు నమోదు
రెమ్డెసివిర్కు బదులుగా నీళ్ల ఇంజెక్షన్.. రోగి మృతి
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..