అమరావతి : ఏపీలోని ఏలూరు జిల్లాలో మూగజీవిని ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. ఓ ఇంటి యజమానికి చెందిన కుక్కను విచక్షణరహితంగా కత్తితో నరికిచంపిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలపల్లిలో గ్రామస్తుడొకరు ఓ ఇంట్లోకి వెళ్లి కుక్కను దారుణంగా నరికి చంపాడు.
దీంతో కుక్క యజమాని గ్రామస్థులతో కలిసి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు . స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్టేషన్ వద్ద ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు.