Pithapuram | పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ నేత ఏఎం రత్నం అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ.. డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా పవన్ కల్యాణ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని పిఠాపురం ప్రజలు అంటున్నారని వెల్లడించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పిఠాపురంలో ఎంత పెద్ద సభలు పెట్టినా సరే ప్రయోజనం ఉండదని.. పవన్ కల్యాణ్ గెలుపును ఎవరూ ఆపలేరని ఏఎం రత్నం స్పష్టం చేశారు. ఫేక్ ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని తమకు సమాచారం ఉందని ఏఎం రత్నం తెలిపారు. దొంగ ఓట్లు వేసి అనవసరంగా జైలు పాలవ్వకండి అని హితవు పలికారు. ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా.. ఓటేయ్యాలని ప్రజలకు సూచించారు. తిరుపతిలోనూ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.