AP CM YS Jagan | ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించిన బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా కూటమి ఏర్పాటు చేశారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిలదీశారు. గురువారం అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో జరిగిన ఎన్నికల సభలో వైఎస్ జగన్మోహన రెడ్డి మాట్లాడుతూ మైనారిటీల ఓట్ల కోసం వారిపై కపట ప్రేమ ప్రదర్శిస్తూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని జగన్ తేల్చేశారు.
రైతులు, మహిళలు, విద్యార్థులకు డబ్బు చెల్లించకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కుట్ర పన్నాయని అన్నారు. సుమారు రూ.14,165 కోట్ల చెల్లింపులకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదన్నారు. ఒకవైపు తెలంగాణలో రైతు భరోసా చెల్లించేందుకు అనుమతించిన ఈసీ.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి కుట్ర పూరితంగా ఒత్తిడి తేవడం వల్లే తమకు ఈసీ అనుమతి ఇవ్వలేదన్నారు.