అమరావతి : రెండు తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది . ఈ నెల 13 న జరుగునున్న పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని సొంత ప్రాంతాలకు వెళ్లే వారి కోసం 22 రైళ్లకు అదనపు కోచ్ల (Additional coaches )ను ఏర్పాటు చేసింది . మే 10 నుంచి 14వ తేదీ వరకు ఆయా రైళ్లలో థర్డ్ ఏసీ (Third AC) , సెకెండ్ ఏసీ, స్లీపర్, చైర్కార్లలో అదనపు కోచ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాకేశ్ తెలిపారు. అదనపు కోచ్ల ఏర్పాటు వల్ల వెయిటింగ్ లిస్ట్ (Waitning List) లో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుందని ఆయన వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఏపీ ఆర్టీసీ బస్సులు
ముఖ్యంగా తెలంగాణలో అధికశాతం ఉన్న ఆంధ్రా ఓటర్లను సొంత ప్రాంతాలకు బస్ సౌకర్యాన్ని కల్పించేందుకు ఏపీఎస్ఆర్టీసీ (APS RTC) ప్రత్యేక సర్వీసులు నడుపనుంది. హైదరాబాద్, బెంగళూరు నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్లు అధికారులు వెల్లడించారు. 199 సర్వీసులు హైదరాబాద్ నుంచి, 95 సర్వీసులు బెంగళూరు నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపేందుకు నిర్ణయించింది.