Congress | హైదరాబాద్ సిటీబ్యూరో/ మెదక్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల వేళ జనజాతరసభలోనూ అదే పం థాను కొనసాగిస్తున్నది. జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చి సీఎం రేవంత్ను మించిపోయి అబద్ధాలను వల్లెవేశారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్లో, ఎల్బీనగర్ పరిధిలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జనజాతర సభలలో రాహుల్గాంధీ హామీలకు, అబద్ధాలకు అంతేలేకుండాపోయింది. రాష్ట్రం లో యాసంగి రైతుబంధు ఇవ్వడానికి ఓవైపు రేవంత్ సర్కారు ఆపసోపాలు పడుతున్నది. ఈ పరిస్థితుల్లో రాహుల్గాంధీ రైతులకు రైతు భరోసా ఇచ్చేశామని గొప్పలు చెప్పడంతో రైతులు ముక్కున వేలేసుకున్నా రు. ఎకరానికి రూ. 5వేలు ఇవ్వడానికే కష్టపడుతున్న కాంగ్రెస్ప్రభుత్వం..ఎకరానికి 7500 చొప్పున ఇచ్చామని చెప్పడమేంటని రైతులు మండిపడ్డారు. ఇదేకాకుండా ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మహిళలకు రూ. 2500 ఇస్తామని చెప్పి ఇంతవరకూ అమలు చేయలేదు. నాలుగు రోజుల క్రితం నిర్మల్ సభలో రాహుల్గాంధీ రూ. 2500 ఇస్తున్నామని చెప్పారు.
తాజాగా కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణలోని ప్రతి కుటుంబం నుంచి ఓ మహిళను ఎంపిక చేసి, ఆ మహిళ బ్యాంకు అకౌంట్లో ఏడాదికి లక్షరూపాయలు డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చా రు. మహిళల చదువు, వైద్యం కోసం ప్రతినెలా రూ. 8500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్క దెబ్బతో దేశంతో పాటు తెలంగాణలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పడం గమనర్హాం. నెలకు రూ. 2500 అమలు చేయని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నెలకు రూ. 8500 ఇస్తామని హామీ ఇవ్వడంపై మహిళలు గుర్రుగా ఉన్నారు.ఇదే కాకుం డా సోనియాగాంధీ జన్మదినం డిసెంబర్ 9న రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, మాట తప్పిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేవుళ్ల ఒట్టు వేసి పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామని గడువు పొడిగించారు.
ఇదేబాటలో రాహుల్గాంధీ కూడా నరేంద్రమోదీ మిలీనియర్ల రుణమాఫీ చేశారు కానీ రైతుల రుణమాఫీ చేయలేదని, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి పని రైతులకు పరిపూర్ణమైన రుణమాఫీ చేయబోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయలేదు. అకాల వర్షాలకు ధాన్యం కొట్టుకుపోతున్నా చోద్యం చూస్తున్న ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకునే రాహుల్గాంధీ ధాన్యానికి మోడీ సరైన వ్యవసాయ ఉత్పత్తులకు ఇవ్వాల్సిన ధర ఇవ్వడం లేదన్నా రు.
కనీస మద్దతు ధర చట్టం కల్పించి వరికి, చెరుకుకు మద్దతు ధర ఇప్పించి తీరుతామని అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను తమ ఖాతాలో వేసుకున్నది. కానీ రాహుల్గాంధీ మాత్రం కేంద్రంలో 30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఆగస్టు 15లోపు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నదని ప్రజలు మండిపడుతున్నారు.