V Hanumantha Rao | హైదరాబాద్ : మల్లు రవికి తాను టికెట్ ఇప్పిస్తే.. టెన్ జన్పథ్లో భట్టి విక్రమార్క తన కాళ్లు మొక్కిండు అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్కను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే తాను.. ఇప్పుడు భట్టికి ఆ కృతజ్ఞత లేదన్నారు వీహెచ్.
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బాగా కష్టపడ్డాడు. రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ సక్సెస్ చేశాడు. బహిరంగ సభలను సక్సెస్ చేశాడు. అన్ని నియోజకవర్గాల్లో తిరిగాడు. కాబట్టి రేవంత్కు సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నదని అన్నాను. ఆ మాట అన్నప్పట్నుంచి భట్టి నా మీద పగబట్టిండు. భట్టిని రాజకీయాల్లోకి తెచ్చిందే హనుమంత రావు. మీ అన్న మల్లు అనంత రామ్ చనిపోయినప్పుడు మల్లు రవికి టికెట్ ఇప్పిస్తే టెన్ జన్పథ్లో భట్టి నా కాళ్లు మొక్కాడు. ఇవాళ నాకు అన్యాయం చేస్తావా..? ఖమ్మం టికెట్ నాకు రాకుండా కుట్ర చేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు.
భట్టి విక్రమార్కను తన తమ్ముడిలా భావించానని.. కానీ తన విషయంలో కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ. హనుమంతరావు ఆరోపించారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చాననే కృతజ్ఞత కూడా లేదని మండిపడ్డారు. అంబర్పేటలోని తన నివాసంలో మధ్యాహ్నం 3 గంటల వరకు వీహెచ్ మౌనదీక్ష చేశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత భట్టి విక్రమార్కకు లేదని వీహెచ్ ఆరోపించారు. ఇప్పుడు తనకు ఖమ్మం ఇకెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేండ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నా అని తెలిపారు. తనకు టికెట్ రాకుండా ఉండేందుకు బయటవారిని తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు.