Home Voting | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం నుంచి లోక్సభ ఎన్నికలకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకేరోజు కాకుండా వెసులుబాటును బట్టి శుక్ర, శనివారాల్లో కూడా హోంఓటింగ్ ప్రారంభంకానున్నది. రాష్ట్రవ్యాప్తంగా 23,248 మంది హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. హోం ఓటింగ్కు 806 బృందాలు, 885 రూట్లుగా ఎన్నికల అధికారులు విభజించారు. ఒక్కో బృందంలో పోలింగ్ అధికారులతోపాటు వీడియో చిత్రీకరణ బృందం కూడా ఉంటుంది. హోంఓటింగ్ను ఈ నెల 6 కల్లా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.