అమరావతి : దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఏపీ విజయనగరంలో ఇద్దరు కొవిడ్ రోగులు కన్నుమూశారు. అధికారులు ఇద్దరు రోగులు మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. ఈ విషాదకర ఘటన స్థానిక మహారాజ ప్రభుత్వ హాస్పిటల్లో చోటు చేసుకుంది. దవాఖానలోని కొవిడ్ ఐసోలేషన్ వార్డులో రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతతో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే మిగతా రోగులను ఇతర ప్రైవేటు హాస్పిటల్స్కు తరలించారు. మరికి కొందరికి అంబులెన్సుల్లో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్ హరిజవహర్లాల్ హాస్పిటల్కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనతో ఐసోలేషన్లో రోగులతో పాటు బాధితుల బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.