హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో సోమవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. నార్కట్పల్లి – అద్దంకి రహదారిపై డివైడర్ను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను చెర్లపల్లికి చెందిన శ్రీకాంత్, వెంకన్నగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.