న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వైద్య అవసరాలకు మినహా ద్రవ ఆక్సిజన్ను దేనికీ వాడవద్దని కేంద్రం అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. సాధ్యమైనంత మేర గరిష్ఠంగా ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాలని ఆక్సిజన్ ఉత్పత్తి కంపెనీలను కోరింది. విపత్తు నిర్వహణ చట్టం కింద కేంద్ర హోంశాఖ ఆదివారం ఈ ఆదేశాలను జారీచేసింది. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. పరిశ్రమల్లో నిల్వ ఉన్న ద్రవ ఆక్సిజన్ను వెంటనే ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాలని, దీనికి ఏ ఒక్క పరిశ్రమ మినహాయింపు కాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు.