హైదరాబాద్ : అప్పుల బాధతో ఓ కూలీ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లెపల్లి, శంషాబాద్ ప్రాంతానికి చెందిన యాదయ్య కుమారుడు శ్రీకాంత్(25) వృత్తి రీత్యా కూలీ. అప్పులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి తిమ్మాపూర్-ఉందానగర్ రైల్వేస్టేషన్ల మద్య రైలు కిందపడి శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో శారీర భాగాలు చెల్లచెదురైనాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని స్వాధీనపర్చుకుని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో సంఘటనలో..
పట్టాలు దాటుతుండగా గుంటూరు రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం.. బుద్వేల్ ప్రాంతానికి చెందిన అనంతయ్యగౌడ్ కుమారుడు నర్సింహులుగౌడ్(49) బుధవారం రాత్రి బుద్వేల్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన గుంటూరు ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని నర్సింహులుగౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?