TS EdCET | హైదరాబాద్ : టీఎస్ ఎడ్సెట్-2024 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని తల్లా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రూ. 250 ఆలస్య రుసుంతో మే 13వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
మే 23న కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు విడతల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు.