న్యూఢిల్లీ : హోలీ పండుగపై కొవిడ్ నిబంధనలు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ఏడాది బిజినెస్ పూర్తిగా పడిపోయిందని భారత వాణిజ్య సంఘాల సమాఖ్య(సీఏఐటీ) వెల్లడించింది. ప్రతి ఏడాది రూ. 50 వేల కోట్ల వ్యాపారం జరిగేదని, ఈ సంవత్సరం మాత్రం బిజినెస్ రూ. 15 వేల కోట్లకు పడిపోయిందని తెలిపారు.
రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో తమ వ్యాపారానికి రూ. 35 వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.
ఈ సందర్భంగా సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్టియా మాట్లాడుతూ.. హోలీ సేల్స్ పూర్తిగా తగ్గాయన్నారు. రంగులు, స్వీట్లు, పువ్వులు, డ్రై ఫ్రూట్స్, తెలుపు రంగు దుస్తుల అమ్మకాలు తగ్గడంతో భారీ నష్టం జరిగిందన్నారు.
ఇవి కూడా చదవండి..