హైదరాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో(Asifabad district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీకొని(Bike collision) ముగ్గురు వ్యక్తులు దుర్మరణం(Three killed) చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతేపల్లి వద్ద చోటు చేసుకుంది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు మహేష్, వెంగల్రావు, నర్సింహగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఒకేసారి ముగ్గురు వ్యక్తులు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా, వేగంగా బైకులు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.