తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన రోడ్షోతో పాలమూరు రాజకీయ ముఖచిత్రం ఒ క్కసారిగా మారిపోయింది. అధికారంలో ఉ న్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన పాలమూరులో పాగా వేసేందుకు ఆ పార్టీ అనేక ఎత్తులు వేస్తున్నది. ఇప్పటికే సీ ఎం హోదాలో నాలుగుసార్లు పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కేసీఆర్ చేపట్టిన రోడ్షోతో పాలమూరు రాజకీయం మలుపు తిరిగింది. అధికారంలో ఉన్న పార్టీకి రానంత జనం కేసీఆర్ రోడ్షోలకు రావడంతో కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టించింది.
మహబూబ్నగర్లో సిట్టింగ్ ఎంపీ మన్నెశ్రీనివాస్రెడ్డి, నాగర్కర్నూల్లో పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తరఫున కేసీఆర్ స్వయంగా రంగంలో దిగడంతో పాలమూరు రాజకీయా లు పూర్తిగా మలుపు తిరిగాయి. బీఆర్ఎస్కు ప్రజాబలం ఇంకా ఉందని తేటతెల్లమైంది. ఇంకా జనం కేసీఆర్ను కోరుకుంటున్నారని రోడ్డు షోల్లో జనం స్పందన చూస్తేనే అర్థమవుతున్నది. అప్పటి వరకు జోరుమీదున్న కాంగ్రెస్, బీజేపీలు కూడా కారు దూకుడుతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మరో వైపు మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నాగర్కర్నూల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తదితరులు అభ్యర్థుల గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికలు అయ్యే వరకు ప్రచారంలో దూకుడు పెంచాలని నిర్ణయించారు. దీంతో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది.