నాంపల్లి కోర్టులు, మే 3 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేయాలని కోరుతూ నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.