deseases | బాన్సువాడ రూరల్, జూన్ 10 : బాన్సువాడ మండలంలోని సంగోజీపేట్ గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ మంద సంగమేశ్వర్ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభకు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంఈవో నాగేశ్వర్ రావు హజరైయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆదాయ, వ్యయాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామసభలో వివరించారు.
ప్రత్యేక అధికారి మాట్లాడుతూ.. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో వ్యాధులు ప్రబల కుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కు ఎంఈవో నాగేశ్వర్ రావు సూచించారు. మురికి కాలువలలో మురికి నిల్వ ఉండకుండా కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని కార్యదర్శికి సూచించారు. గ్రామంలో నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు చూడాలన్నారు.
ప్రభుత్వ పథకాలు గ్రామంలో సక్రమంగా అమలు అయ్యేలా పాలవకర్గం పని చేయాలని అన్నారు. గ్రామంలో బడి ఈడు పిల్లలను తప్పకుండా బడికి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావల్సిన అన్ని రకాల మౌళిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. వర్షాకాలంలో రైతులు బోరు బావుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral