న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసిన మార్కింగ్ ఫార్ములా పట్ల 12 వ తరగతి విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయం కావాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సీబీఏస్ఈ విడుదల చేసిన ఫార్ములా ముమ్మాటికీ సమానత్వ హక్కుల ఉల్లంఘనే అని సుప్రీంకోర్టుకు మెరపెట్టుకున్నారు. సీబీఎస్ఈ నిర్ణయించిన మార్కింగ్ ఫార్ములాకు సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపింది. అయితే, బోర్డు మార్కింగ్ పథకం పట్ల అసంతృప్తి చెందిన విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలోని 1152 మంది విద్యార్థులు ఈ విధానంపై ప్రశ్నలు వేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మార్కింగ్ ఫార్ములాకు పలు సూచనలు కూడా ఇచ్చారు. న్యాయవాది మను జైట్లీ ద్వారా దాఖలు చేసిన పిటిషన్లో.. విద్యార్థులు కంపార్టమెంటలైజ్డ్ కోసం ఒక విధానాన్ని తీసుకురావాలని కోరారు.
12 వ తరగతి ఫలితాలను నిర్ణయించడానికి మార్కింగ్ పథకాన్ని తమకు సమర్పించాలని జూన్ 03 న సుప్రీంకోర్టు సీబీఎస్ఈకి సూచించింది. దాంతో జూన్ 17 న కోర్టులో బోర్డు తన ఫార్ములాను సమర్పించి, 30:30:40 సూత్రం ద్వారా ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. కానీ పిటిషనర్ల ప్రకారం, కొత్త విధానం కంపార్ట్మెంట్, డ్రాప్ అవుట్, ప్రైవేట్ అభ్యర్థులకు మరో రకంగా తీసుకొచ్చారని, ఇది రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులలో సమాన హక్కు (ఆర్టికల్ 14) ను ఉల్లంఘించడమే అని కోర్టుకు విన్నవించారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో బోర్డు ప్రవర్తించడం సరికాదని, అందరు విద్యార్థులను సమానంగా చూడాలని విద్యార్థులు తమ పిటిషన్లో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేశారు.
ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!
చరిత్రలో ఈరోజు : హిందుత్వానికి ప్రతీకగా శివసేన ఆవిర్భావం
కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
మూడో అతిపెద్ద వజ్రం దొరికింది.. ఎక్కడంటే..?
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..