హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University)అర్ధరాత్రి తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు(Students protest) కూడా లేవని రోడ్డు మీద బైఠాయించి విద్యార్థులు ఆందోళన(Water problem) చేపట్టారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని వాపోయారు. ఉదయం నుంచి నీళ్లు లేవని మొర పెట్టుకుంటే రాత్రి ఒక్క ట్యాంకర్ పంపారని.. అవి దేనికి సరిపోవన్నారు. వెంటనే నీటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్దు ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.