Rahul Gandhi | హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ పాల్గొన్న ఈ సభకు జనాలు కరవయ్యారు. సభ ప్రారంభమైనప్పటికీ జనాలు ఎవరూ రాకపోవడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. జనం లేకపోవడంతో స్టేజి ఎక్కడానికి ఇష్టపడని రాహుల్ గాంధీ చాలాసేపటి వరకు క్యారవాన్లోనే కూర్చుండిపోయారు.
ఆ తర్వాత కాసేపటికే రాహుల్ గాంధీ స్టేడియం మీదకు వచ్చి ప్రసంగించారు. ఆ సమయంలోనూ ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంతో పట్టుమని పది నిమిషాలు కూడా రాహుల్గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించలేరు. ఆదరబాదరాగా ప్రసంగం ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, సభలో జనాలు లేక కుర్చీలు వెలవెలబోవడంతో కాంగ్రెస్ నేతలు ఒకింత అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.
జనం లేక ఖాళీ కుర్చీలతో బోసి పోయిన రాహుల్ గాంధీ సరూర్ నగర్ సభ pic.twitter.com/sWMoQmKuGu
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2024
జనం లేక ఖాళీ కుర్చీలతో సరూర్ నగర్ రాహుల్ గాంధీ సభ
జనం లేక స్టేజీ ఎక్కడానికి ఇష్టం లేక క్యారవాన్లో కూర్చున్నా రాహుల్ గాంధీ pic.twitter.com/oPXLb3Hgoe
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2024