Cinema News | మోహన్భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్కల్యాణ్, రవీంద్రవిజయ్ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘ఆరంభం’. అజయ్ నాగ్ వి. దర్శకుడు. అభిషేక్ వీటీ నిర్మాత. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్కి హీరో శ్రీవిష్ణు అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అందించారు.
ఇంకా నటుడు తిరువీర్, దర్శకుడు నవీన్ మేడారం, వెంకటేశ్ మహా, నటి శివానీ నాగారం కూడా అతిథులుగా హాజరై యూనిట్కి విషెస్ తెలిపారు. ఒక మంచి సినిమా నిర్మించామన్న సంతృప్తితో ఉన్నామని నిర్మాతలు తెలిపారు. ఒక అద్భుతమైన కంటెట్ ఉన్న సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉందని నటీనటులు సంతోషం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: దేవ్దీప్ గాంధీ కుందు, మాటలు: సందీప్ అంగిడి, సంగీతం: సింజిత్ యెర్రమిల్లి.