సుగి విజయ్, రూపాలి భూషణ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మాత్రు’. జాన్ జక్కీ దర్శకుడు. బి.శివప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సైంటిఫిక్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం.
కథ, కథనాలు ఆసక్తికరంగా సాగుతాయి. కథానుగుణంగా టైటిల్ పెట్టాం. త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. అలీ, దేవిప్రసాద్, ఆమని, రవి కాలే, నందిని రాయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాహుల్శ్రీవాస్తవ్, సంగీతం: శేఖర్చంద్ర, నిర్మాణ సంస్థ: శ్రీపద్మినీ మూవీస్, రచన-దర్శకత్వం: జాన్ జక్కీ.