హైదరాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. మామపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాగజ్నగర్ టీచర్స్కాలనీలో చోటు చేసుకున్నది. గంగారాం (50) అనే వ్యక్తిపై అతని అల్లుడు కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో గంగారాం మృతి చెందాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.