ముంబై : మహారాష్ట్ర హోంమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్తో సచిన్ వాజ్ సన్నిహితంగా ఉండేవారు. అన్ని ముఖ్య కేసులు వాజ్కు పరంబీర్సింగ్ అప్పగించేవాడు. ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు వాజ్ నేరుగా ఆయనకే రిపోర్ట్ చేసేవారు.. ఇవన్నీ ప్రస్తుత ముంబై కమిషనర్ హేమంత్ నగ్రాలే హోంమంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలోని అంశాలు. ముంబైలోని ఒక పత్రిక ఈ విషయాలను ప్రచురించింది.
ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే తన నివేదికలో పరంబీర్ సింగ్, సచిన్ వాజ్ మధ్య ఉన్న సంబంధం గురించి పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తున్నది. నివేదిక ప్రకారం.. పరంబీర్ సింగ్ సమక్షంలో మాత్రమే సచిన్ వాజ్ తిరిగి ఉద్యోగంలో నియమితులయ్యారు. చాలా మంది అధికారులు అసంతృప్తితో ఉన్నప్పటికీ సచిన్ వాజ్ను ఉన్నతోద్యగంలో నియమించినట్లు నివేదిక వెల్లడించింది.
వాజ్ సాధారణ పోలీసు ఆధికారి అయినప్పటికీ.. సచిన్ వాజ్ నేరుగా పరంబీర్ సింగ్కు రిపోర్ట్ చేసేవాడు. పరంబీర్ సింగ్ సూచనల తర్వాత అన్ని ఉన్నతస్థాయి కేసుల దర్యాప్తు వాజ్కు అప్పగించారు. వాజ్ బృందంలోని వారికి కూడా తమ సీనియర్ అధికారులకు విచారణకు సంబంధించిన విషయాలను ఏవీ చెప్పవద్దని చెప్పారు.
మంత్రులతో ఉన్నత విషయాల గురించి బ్రీఫింగ్ సందర్భంగా పరంబీర్సింగ్తోపాటు సచిన్ వాజ్ కూడా హాజరయ్యేవారు. ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి వాహనాలను తమ కార్యాలయాలకు తీసుకువచ్చేవారని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే తన నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం.
ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంవీర్ సింగ్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్ దేశ్ ముఖ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా ఉపయోగించుకుంటుందని పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అనిల్ దేశ్ముఖ్ పిటిషన్లలో పలు ప్రశ్నలు తలెత్తాయి.
అనిల్ దేశ్ముఖ్ను విచారించకుండా బాంబే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం… విచారణ ఉత్తర్వులను ఏకపక్షంగా ఆదేశించడం. కేంద్ర ప్రభుత్వం సీబీఐని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నది. సీబీఐ పనిని తాత్కాలిక డైరెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో సీబీఐకి దర్యాప్తు ఇవ్వడానికి గల కారణం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును హైకోర్టు విశ్వసించలేదా? అనిల్ దేశ్ముఖ్ తన పదవికి రాజీనామా చేసినట్లు పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులో వారు జోక్యం చేసుకోగలరనడానికి ఎలాంటి కారణం లేదని విన్నవించింది.
బెంగాల్ ఎన్నికల్లో ‘కూపన్ల పంపిణీ’ వివాదం
పరిచయం అక్కర్లేని సితార్ ప్లేయర్.. పండిత్ రవిశంకర్.. చరిత్రలో ఈరోజు
ప్రధానిపై అసత్య రాతలు.. బ్లాగర్కు 72 లక్షల జరిమానా
బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్ఖాన్
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..