హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో శ్రీనివాస్ (28), అతని కూతురు మోక్ష (3) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో శ్రీనివాస్ భార్యకు తీవ్ర గాయాలవగా.. పోలీస్స్టేషన్కు తరలించగా.. చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.