న్యూఢిల్లీ : సీరం ఇన్స్టిట్యూట్ కోవోవాక్స్ కొవిడ్ టీకా 2-17 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలపై ఫేజ్-2, 3 ట్రయల్స్ నిర్వహించొద్దని సెంట్రల్ డ్రగ్ అథారిటీ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అయితే, పెద్దలపై మొదట ట్రయల్స్ పూర్తి చేయాలని ప్యానెల్ సీరం సంస్థకు సూచించింది. సీరం దేశవ్యాప్తంగా పది కేంద్రాల్లో 2-11, 12-17 సంవత్సరాల మధ్య 920 మంది పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కు చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) కూడా ఏ దేశంలోనూ వ్యాక్సిన్ను ఆమోదించలేదని పేర్కొంది. అమెరికాకు చెందిన నోవావాక్స్ ఇంక్ సంస్థ ఎన్వీఎక్స్ కోవ్ 2373 పేరిట అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను భారత్లో ఉత్పత్తి చేసేందుకు సీరం కంపెనీ ఒప్పందం చేసుకుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో వ్యాక్సిన్ ఎన్వీఎక్స్-2373 టీకా మితమైన, తీవ్రమైన కేసుల్లో వందశాతం ప్రభావంతంగా పని చేస్తున్నట్లు తేలింది. మొత్తంగా 90.4 శాతం సమర్థతతను చూపిందని జూన్ 14న నోవావాక్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.