వనపర్తి, మే 5 : నాడు టీడీపీలో ఉన్న సందర్భం లో కాంగ్రెస్ నాయకురాలిపై ఎంతనీచంగా మాట్లాడావో ప్రజలకు గుర్తున్నదని, ఇప్పుడు అదే కాంగ్రెస్లో చేరి సోనియమ్మ దేవత, రుణం తీర్చుకుంటామని బీరాలు పలుకుతుండడం చూసి, ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. నీలాగా ఎవరూ రంగు లు మార్చలేరన్నారు. ఆదివారం తన నివాసంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బైకాని శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్తో కలిసి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ర్టానికి ఓ సీఎంగా ఉండి రేవంత్రెడ్డి బా ధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని, కేవలం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ రా ష్ట్ర సాధకుడు, రెండు సార్లు సీఎంగా పనిచేసిన, వ యస్సులో నీకన్నా 20ఏండ్లు పెద్దవారు అన్న ఇంగి త జ్ఞానం లేకుండా మాట్లాడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ సీఎం, మంత్రులు కూడా రేవంత్లా ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చే సిన దాఖలాలు లేవన్నారు. దక్షిణాదిలో ఏ పార్టీ కూడా మూడుసార్లు అధికారంలో ఉన్న దాఖలాలు లేవని ఇక్కడి ప్రజలు రెండు సార్లు ఇచ్చిన అవకా శం మూడో సారి ఇతర పార్టీలకు ఇస్తుంటారన్నారు.
అదేకోణంలో తెలంగాణ ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతతో కేవలం 1:8 శాతం ఓట్లతో కాంగ్రెస్కు అవకాశం కల్పించారన్నారు. ఇంకా తెలంగాణలో ప్రజ లు బీఆర్ఎస్ వైపై ఉన్నారని, వచ్చే పార్లమెంట్లో అత్యధిక స్థానాలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు నీకు ఇచ్చి న అధికారాన్ని ప్రజల అభివృద్ధికి కేటాయించాల్సి పోయి, ఒక డిక్టేటర్గా వ్యవహరిస్తూ నిత్యం ఏ మీటింగ్లో కానీ, సభలో కానీ, సమయం, సం దర్భం లేకుండా మాజీ సీఎం కేసీఆర్ను తిట్టడమే పరమావధిగా పెట్టుకున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నిక ల సమయంలో ఇచ్చిన హామీలపై అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తి కావస్తున్నా సీఎం నోరు మెదపడం లేదన్నారు. గత ప్రభుత్వం లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి ఎన్నికల కన్నా ముందే మరో 36 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్షలను కూడా నిర్వహించిందని, ఎన్నికల అనంతరం ప్రభుత్వ మార్పు జరిగిందని, గత ప్రభుత్వ ఉద్యోగాలను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుమాలిన చర్య అన్నారు. నాడు పోలీస్ రిక్రూట్మెంట్లో జీవో నెం.46తో మొత్తం ఏమో జరిగిపోతుందని యువకులను పెడదారి పట్టించారని, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినా దానిని ఎందుకు రద్దు చేయడం లేదో యువతకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పుడూ మహబూబ్నగర్ బిడ్డను అని చెప్పుకునే నువ్వు 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగా రెడ్డిని పూర్తి చేసి సాగు నీరందించాలని సవాల్ విసిరారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక దేవుళ్లపై ఒట్టు వేస్తూ కాలయాపన చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. యాసంగి పోయి.. మళ్లీ వానకాలం సీజన్ మొదలు కాబోతుంది, ఇప్పటివరకు రైతు బంధు లేదన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు కో సం రూ.7,500 కోట్లు సిద్ధం చేస్తే ఎన్నికల పేరుతో అడ్డంకులు సృష్టించింది మీరు కాదా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాల్సిన డబ్బులను మీ కాంట్రాక్టర్లకు బి ల్లులు చెల్లించుకున్నారని మండిపడ్డారు. కృష్ణానది పరీవాహక ప్రాజెక్టులను ట్రిబ్యునల్కు అప్పజెప్పకుండా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, మీరొచ్చిన వెంటనే అప్పనంగా అప్పజెప్పిన విషయం వాస్తవం కాదా అన్నారు. కేంద్రం గోదావరి మీద కావేరిని అనుసంధానం చేసే ప్రయత్నాన్ని గత ప్ర భుత్వం తిరస్కరిస్తే అప్పనంగా అప్పజెప్పేందుకు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. దేశంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు కూడా కాంగ్రెస్ సీఎం సహకరిస్తున్నాడన్నారు. సీఎం హోదాలో విధానపరమైన విమర్శలు చేస్తే తప్పు లేదు, కానీ వ్యక్తిగత విమర్శలు చేసి ఇతరుల మనోభావాలు దెబ్బతీయకూడదని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు లక్ష్మయ్య, కురుమూర్తియాదవ్, పరంజ్యోతి, శేఖర్నాయక్, ధర్మనాయక్, బాలపీరు, విజయ్కుమార్ పాల్గొన్నారు.