ఉండవెల్లి, మే 17 : ఆగి ఉన్న ఆటోను బస్సు ఢీకొన్న ఘటన ఉండవెల్లి మండల శివారులోని వీకేర్ కోల్డ్ స్టోరేజ్ వద్ద చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కర్నూ ల్ జిల్లా పెద్ద టేకూరుకు చెందిన శేఖర్, డ్రైవర్ చిరంజీవితో కలిసి జొన్నల సం చులు విక్రయించేందుకు బయలుదేరాడు.
శుక్రవా రం తెల్లవారుజామున వర్షం కురుస్తుండటంతో ఉండవెల్లి శివారులోని వీకేర్ కోల్డ్స్టోరేజ్ వద్ద ఆటోను ఆపారు. ఈక్రమంలో పాండిచ్చేరి నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టి పొలాల్లోకి దూ సుకెళ్లింది. ఘటనలో బస్సులోని ప్రయణికులతోపా టు ఆటోలోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు.