మహబూబ్నగర్ అర్బన్, మే 17 : రాష్ట్రంలో ప్రస్తు తం పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కావడం లేదు. ఫలితంగా థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్ర సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు తాత్కాలిక విరామం ప్రకటించారు. శనివారం మహబూబ్నగర్లోని థియేటర్ల యజమానులను సంప్రదించగా..
ప్రేక్షకుల ఆదరణ తగ్గడం, ఓటీటీల్లో సినిమాలు ప్రసారం అవుతుండడంతో సినిమా హాల్ రోజు వారి వ్యయం భారంగా మారిందన్నారు. కొత్త సినిమాలు రిలీజ్ కావడం లేదని, అందుకే శుక్రవారం నుంచి వారం రోజుల పాటు షోలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కాగా మల్టీప్లెక్స్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆదాయం తక్కువగా వచ్చినప్పటికీ రోజుకు రెండు షోలు నడిపిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.