వనపర్తి, మే 17 : మండలంలోని కడుకుంట్ల చింతల చెరువులో చేపలు శుక్రవారం మృతి చెందడంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామానికి చేరుకొని చెరువులోని నీటిని శాంపిల్స్గా సేకరించారు. ఆ నీటిని మత్స్యకారులు పెబ్బేరులోని మత్స్యకళాశాల ల్యాబ్కు తీసుకెళ్లగా.. చెరువులోకి మురుగు చేరడంతోనే నీరు కలుషితమై చేపలు చనిపోయినట్లు తెలిపారు.