హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం కొత్త విధానానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుకాణాల అనుమతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021-23 సంవత్సరానికి చెందిన నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయగా.. దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను అమలులోకి తీసుకువచ్చింది. గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. జిల్లాల్లో జనాభా ప్రతిపదికన లాటరీల ద్వారా దుకాణాలు కేటాయించనున్నారు. దరఖాస్తు ఫీజును రూ.2లక్షలుగా నిర్ణయించింది. అయితే, పాత స్లాబులే కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.