తెలుగుయూనివర్సిటీ, మే 18 : కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం 2020-21 సంవత్సరానికి నగరానికి చెందిన చిత్రకారుడు కప్పరి కిషన్ పెయింటింగ్ ఆర్ట్ లెజెండ్ గోల్డెన్ లోటస్ అవార్డుకు ఎంపికైనట్లు పరిషత్తు వ్యవస్థాపకుడు కె.సీతారామశాస్త్రి తెలిపారు.
తెలంగాణ యువతుల జడలు చిత్రానికి వచ్చిన ఈ అవార్డును జూన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తారు. అవార్డుతో పాటు గోల్డ్మెడల్, జ్ఞాపికతో సత్కారం చేస్తామని సీతారామశాస్త్రి పేర్కొన్నారు.