వికారాబాద్, మే 7 : కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వికారాబాద్ జిల్లా రద్దు అవ్వడం ఖాయమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మంగళవారం మోమిన్పేట మండల పరిధిలోని దుర్గంచెరువు, కేసారం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. గ్రామ శివార్లలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో ముచ్చటించారు. ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిస్తే వికారాబాద్ జిల్లాను రద్దు చేస్తామంటున్నారని, ఒకవేళ వికారాబాద్ జిల్లాను రద్దు చేస్తే ఏ అవసరం ఉన్నా హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఇది వికారాబాద్ ప్రజలు గమనించి వికారాబాద్ జిల్లా ఉండాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే స్థితిలో లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి కాలయాపన చేస్తున్నదన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండే ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షుడు వెంకన్న, మండల యూత్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, ఎన్కతల మాజీ సర్పంచ్ అనంతయ్య, హిజ్రా చిట్టెంపల్లి మాజీ సర్పంచ్ కాశీరాం, కేసారం మాజీ సర్పంచ్ జి అనంతయ్య, కేసారం మాజీ ఉప సర్పంచ్ కిష్టయ్య, నాయకులు శంకరయ్య, అనిల్ కుమార్, సల్మాన్, సంసాన్, యువ నాయకులు అభిషేక్, స్టాలిన్, రియాజ్, మల్లేశ్గౌడ్, శ్రీకాంత్, ముత్తు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.