న్యూఢిల్లీ, మే 7: షావోమీ ఫోన్లతో పాటు ఈ కంపెనీకి చెందిన రెడ్మీ, పోకో స్మార్ట్ఫోన్లలో ప్రమాదకర వైరస్ను సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వైరస్ వల్ల వినియోగదారుల వ్యక్తిగత డాటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫోన్లలో ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 మధ్య దాదాపు 20 భద్రతాపరమైన లోపాలు, సమస్యలను సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు.
ఈ వివరాలను ఓవర్సెక్యూర్డ్ అనే బ్లాగ్లో ప్రచురించారు. ఎంఐయూఐ, హైపర్ఓఎస్ వినియోగించే ఫోన్లలో ఈ సమస్యలు ఉన్నట్టు పేర్కొన్నారు. షావోమీ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ యాప్(ఏఓఎస్పీ)లలో లోపాలు ఉన్నాయని, వీటిని వెంటనే సరిచేయాలని తెలిపారు. ఈ భద్రతాపరమైన లోపాల గురించి చైనాకు చెందిన షావోమీ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.