Loksabha Elections 2024 : కాంగ్రెస్ హయాంలోనే ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేశారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. దేశంలో ఇప్పటివరకూ ఆర్టికల్ 356 కింద 132 సార్లు రాష్ట్రపతి పాలన విధించగా అందులో 90 సార్లు కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, ప్రభుత్వాలను కూల్చడంలో ఇందిరా గాంధీ అర్ధ సెంచరీ సాధించారని అన్నారు.
దేశానికి స్వతంత్రం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ సూచించినా కాంగ్రెస్ పెడచెవిన పెట్టిందని వ్యాఖ్యానించారు.మహాత్మాగాంధీ చెప్పినవన్నీ నెరవేర్చాలని ఇప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయించుకున్నారని తాను భావిస్తున్నానని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
మనమిప్పుడు ఈ కాంగ్రెస్ను రద్దు చేయాలని, కాంగ్రెస్ను రద్దు చేయడానికి ప్రజలు కూడా అంగీకరిస్తారని తాను భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో విచ్చలవిడీ అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు.
Read More :
Gajwel | ఇది ఐలవ్వ మాట.. ఇప్పుడే ఎలచ్చన్ పెడితే కేసీఆరే అస్తడు