న్యూఢిల్లీ : మరో రెండు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధమైంది. హర్యానా, ఉత్తరాఖండ్కు చెందిన 3 ప్లాంట్లు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్లాంట్లు లాక్డౌన్ నేపథ్యంలో గత నెల 22 నుంచి మూసివేసి ఉన్నాయి.
దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీదారు హీరో మోటోకార్ప్ మే 17 నుంచి 3 ప్లాంట్లలో ఉత్పత్తిని ప్రారంభించబోతున్నది. ప్రస్తుతం హర్యానా, ఉత్తరాఖండ్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హీరో మోటోకార్ప్ ఏప్రిల్ 22 నుండి మే 2 వరకు అన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని దశలవారీగా నిలిపివేసింది. మే 16 వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
హర్యానాలోని గురుగ్రామ్-ధారుహేరా, ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం కానుందని హీరో మోటోకార్ప్ తెలిపింది. ప్రస్తుతం, మూడు ప్లాంట్లలో షిఫ్టులో పని జరుగుతుందని పేర్కొన్నది. ఇతర ప్లాంట్లలో ఉత్పత్తికి సంబంధించి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇతర ఉత్పాదక కర్మాగారాలు, సౌకర్యాలను క్రమంగా తెరువనున్నారు.
హర్యానా, ఉత్తరాఖండ్తో పాటు, హీరో మోటోకార్ప్లో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, రాజస్థాన్లోని నీమ్రానా, గుజరాత్లోని హలోల్లలో కూడా ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లన్నింటిలో 80 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. 45 ఏండ్ల వయసు పైబడిన ఉద్యోగులలో 90 శాతం కంటే ఎక్కువ మంది టీకాలు వేసినట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. అన్ని ప్లాంట్లలో కఠినమైన భద్రత, పరిశుభ్రత ప్రోటోకాల్లను అనుసరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
స్పైస్జెట్ నిర్వాకం.. రోజంతా పైలట్లకు జాగారం..
100 పడకల కొవిడ్ కేంద్రం ఏర్పాటులో నటి జాక్వెలిన్ బిజీ
టీకాలు తీసుకున్నా.. మాస్క్లు మరువొద్దు : డాక్టర్ రణదీప్ గులేరియా
ఆధునిక హంగులతో రాజధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్
“మీ ప్రియమైన వారి చేయి వదలకండి”: టీనా అంబానీ సందేశం
తెరపైకొచ్చిన మిక్కీ మౌస్.. చరిత్రలో ఈరోజు
అక్కడ మసీదులు మాయమయ్యాయి.. ఎందుకంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..